*రమణ మహర్షి విశేషాలు*
1) రమణ మహర్షి ప్రత్యక్ష సుబ్రహ్మణ్య స్వామి అవతారం
2) వారు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అరుణాచలం వెళ్ళారు.
3) వారు శరీరం విడిచి పెట్టే వరకు అరుణాచలం విడిచిపెట్టలేదు.
4) వారు శరీరాన్ని విడిచిపెట్టిన సమయంలో, 5 జ్యోతులు ఆకాశంలోకి వెళ్లి అరుణాచల పర్వతంలో కలిసిపోయాయి
5) వారు చాలా సంవత్సరాలు ఏమీ తినకుండా, నీరు కూడా తాగకుండా తపస్సు చేశారు
6) వారు కుక్కలు / కోతులు / నెమళ్ళు / పులులు / ఆవులు / ఏనుగులు మొదలైన వాటితో మాట్లాడేవారు.
7) ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో వారు తెలుసుకోగలరు
8) వారి సమక్షంలో, జంతువులన్నీ తమలోని నిజమైన శత్రు భావనను మరచిపోయి స్నేహంగా ఉండేవి.
9) వారు తన తల్లికి ముక్తిని ఇచ్చారు- కొన్ని కోట్ల జన్మల కర్మలను కొన్ని గంటలలో సూక్ష్మ శరీరముతో అనుభవింప చేసారు
10) మహర్షి చాలా సాదా సీదా జీవితాన్ని గడిపేవారు
11) మహర్షి ప్రతి వారం అరుణాచల పర్వతం గిరి ప్రదక్షిణ 2/3 రోజులు చేసేవారు.
12) వారు చాలా సంవత్సరాలు ఎవరితోనూ మాట్లాడలేదు
13) వారిని మౌన స్వామి అనే పేరుతో పిలిచే వారు
14) తరువాత కావ్యకంఠ గణపతి మునితో మొట్టమొదటి సారిగా మాట్లాడారు.
15) కావ్యకంఠ గణపతి ముని వారికి - భగవాన్ శ్రీరమణ మహర్షి అనే పేరు పెట్టారు.
16) మహర్షి ఉపదేశ సారము & అరుణాచల అక్షర మణిమాల అని పిలువబడే 2 ప్రసిద్ధ రచనలను లోకానికి ఇచ్చారు
17) చాలా మంది సిద్ధ పురుషులు - జంతువుల రూపంలో మహర్షిని సేవించేవారు
18) మహర్షి ఆ యొక్క సిద్ధ పురుషులు శరీరము విడిచి పెట్టిన తర్వాత - వారందరికిీ భూమిలో దహన సంస్కారాలు చేశారు
19) ఇప్పటికీ వారి సమాధులను మనం రమణ మహర్షి ఆశ్రమంలో చూడవచ్చు
20) మహర్షి తనను చూడటానికి వచ్చే ప్రతి ఒక్కరి మనస్సులను చదవగలరు
21) దేశవిదేశాల నుండి భక్తులు మహర్షిని కలవడానికి వచ్చేవారు
22) మహర్షి తన చుట్టుూ ఉండే జంతువులకు జీడిపప్పు/బాదం పెట్టే వారు
23) మహర్షి కేవలం గోచీ మాత్రమే ధరించేవారు